మన చుట్టూ అనేక శివాలయాలు ఉన్నప్పటికీ..కొన్ని ఆలయాలు ప్రత్యేక రహస్యాన్ని కలిగి ఉంటాయి. వాటిలో ఈ 5 శివాలయాలు ఉన్నాయి. సైంటిస్టులకు సవాల్ విసురుతున్న ఈ 5 శివాలయాల రహస్యం ఏంటో తెలుసుకుందాం.
మహాశివుని మహిమ అపారమైనది. ఇతర దేవతలతో పోలిస్తే, శివుడిని ఆరాధించే భక్తులు అధిక సంఖ్యలో ఉంటారు. భారతదేశంలో అనేక శివాలయాలు ఉన్నాయి. అయితే కొన్ని శివాలయాలు చాలా ప్రత్యేకం. ఆ శివాలయాల్లో ఉన్న రహాస్యాన్ని శాస్త్రవేత్తలు ఇప్పటివరకు చేధించలేకపోయారు. ప్రపంచంలోనే అతి పురాతనమైన శివాలయం నుండి, పిడుగుపాటు శివ లింగమాదవే వరకు, రోజుకు రెండుసార్లు అదృశ్యమై తిరిగి కనిపించే శివాలయం గురించి మీకు చెప్పబోతున్నాం. సైన్స్కు సవాలు విసిరిన ఈ 5 అద్భుతమైన శివాలయాల గురించి ఆసక్తికర విషయాలను తెలుకునే ప్రయత్నం చేద్దాం.
ప్రతిరోజూ మూడు రంగుల్లో కనిపించే శివలింగం:

రాజస్థాన్లోని ధోల్పూర్లో ఈ అద్భుతమైన శివాలయం ఉంది. ఈ శివాలయంలోని శివలింగం రంగు రోజుకు మూడు సార్లు మారుతుంది. ఉదయం శివలింగంపై ఎరుపు రంగు, మధ్యాహ్నం కుంకుమ వర్ణంలో శివలింగం దర్శనిమిస్తుంది. సాయంత్రం హారతి సమయంలో, శివలింగంపై శివుని నలుపు రంగు కనిపిస్తుంది. మీరు రాజస్థాన్ వెళుతున్నట్లయితే, ఒక్కసారి అచలేశ్వర మహాదేవ్ని దర్శించండి.
ప్రతిరోజూ రెండుసార్లు శివలింగం మాయమవుతుంది:

గుజరాత్లోని స్తంభేశ్వర్ మహాదేవ ఆలయం అత్యంత అద్భుతమైన శివాలయాల్లో ఒకటి. ఈ ఆలయంలో శివలింగం రోజుకు రెండుసార్లు అదృశ్యమవుతుంది. కొంత సమయం తర్వాత తిరిగి కనిపిస్తుంది. శివునికి జలాభిషేకం చేయడానికి సగరుడు స్వయంగా వచ్చినప్పుడు శివుడు అదృశ్యమవుతాడని నమ్ముతారు. ఈ ఆలయం పేరు జంబూసర్ తహసీల్ స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం. ఈ శివాలయం గుజరాత్లోని వడోదరకు 40 కి.మీ దూరంలో ఉంది.
పిడుగుపాటుకు విరిగిపోయిన శివాలయం:

కులు లోయలోని బిజిలీ మహాదేవ్ ఆలయం ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పిడుగుపాటుకు గురవుతుంది. ఈ పిడుగు చాలా భయంకరంగా నేలను తాకుతుంది, పిడుగుపాటుకు శివలింగమే పగిలిపోతుంది. కానీ ఆలయ పూజారులు మరుసటి రోజు ఈ శివలింగాన్ని వెన్నతో తిరిగి ఏర్పాటు చేస్తారు. అప్పుడు శివలింగం మునుపటిలా దర్శనమిస్తుంది.