కేశవనామాల వెనక శాస్త్రీయ కారణం!

కేశవనామాల వెనక శాస్త్రీయ కారణం!

హిందూ పురాణాలలో విష్ణుమూర్తికి ఉన్న ప్రాశస్త్యం అంతా ఇంతా కాదు. విష్ణుమూర్తికి ఇరవై నాలుగు పేర్లు ఉన్నాయి. వాటినే కేశవనామాలు అని అంటారు. అయితే విష్ణు సహస్ర నామాల్లా, లలితా సహస్రనామాల్లా ఈ కేశవనామాలు పెద్దగా లేకుండా కేవలం ఇరవై నాలుగు మాత్రమే ఎందుకు ఉన్నాయి?? కాలచక్రంలో రోజుకు ఇరవై నాలుగు గంటలు కదా!! ఈ కాలచక్రానికి, అన్నింటిలోనూ ఒక భాగంగా ఉండే గణితానికి ఏదైనా సంబంధం ఉందా??. కొన్నిసార్లు కొన్ని విషయాలను పోల్చి చూసినప్పుడు అంతా ఒట్టిదే అలాంటి నిఘోడ రహస్యాలు ఏమి ఉండవులే అనిపిస్తుంది. కానీ అవి పూర్తిగా బయటకు తెలిసిన తరువాత ఆశ్చర్యపోతారు. అలాంటిదే కేశవనామాల వెనుక రహస్యం కూడా. విష్ణుమూర్తిని చతుర్భుజుడు అంటారు. చతుర్భుజుడు అంటే నాలుగు చేతులు కలిగిన వాడు అని అర్థం.నాలుగు చేతులలో శంఖు, చక్ర, గదా, పద్మాలు పట్టుకుని ఉంటాడు విష్ణువు. ఎక్కడైనా సరే అలాగే దర్శనం ఇస్తాడు కూడా.  అయితే బాగా గమనిస్తే ఈ నాలుగు ఆయుధాల యొక్క అమరికలో వచ్చే మార్పుల వల్లనే విష్ణువుకు ఇరవై నాలుగు వేరు వేరు రూపాలు ఏర్పడతాయని ఆ రూపాలకు కలిగిన పేర్లనే కేశవనామాలు అంటున్నారు. కేశవ నామాలలో మొదటి నామం కేశవ. ఈ కేశవ రూపంలో స్వామి కుడివైపు ఉన్న రెండు చేతులతో పద్మము, శంఖము పట్టుకుని ఉంటాడు.  ఎడమ వైపు ఉన్న రెండు చేతులతో గద,చక్రం పట్టుకుని ఉంటాడు.  అలాగే విష్ణువు యొక్క మరొక నామము మాధవ. ఈ మాధవ రూపంలో కుడి వైపు రెండు చేతులతో గద,చక్రం పట్టుకుని ఉంటాడు. ఎడమవైపు ఉన్న రెండు చేతులతో పద్మము,శంఖము పట్టుకుని ఉంటాడు. మధుసూధన రూపంలో కుడివైపు చేతులతో చక్రం, శంఖము మరియు ఎడమవైపు చేతులతో గద,పద్మము పట్టుకుని ఉంటాడు. ఈవిధంగా విష్ణువు  ప్రతి పదిహేను రోజులకు ఒకసారి అంగీ  పౌర్ణమికి, అమావాస్య కు తన ఆయుధాలను చేతులు మార్చుకుంటూ ఉంటాడు ఇలా మారుతున్న రూపాలకు అనుగుణంగానే కేశవనామాలు ఏర్పడ్డాయి. సంవత్సర కాలంలో పన్నెండు నెలలు ఉంటే, నెలలో రెండు సార్లు ఆయుధాలను మార్చుకుంటాడు. కాబట్టి ఇరవైనాలుగు సార్లు జరిగిన మార్పులకు ఇరవై నాలుగు నామాలు ఏర్పడ్డాయి.  ఈ మార్పులు లేదా అమరికలను మనం గణిత శాస్త్ర పరంగా ప్రస్తారాలు అంటాం. అనగా 4 వస్తువులను 4  విధాలుగా అమర్చవచ్చు.  4! = 4×3×2×1=24 శంఖాన్ని  ‘శ’ తోను, చక్రాన్ని ‘చ’ తోను, గదను ‘గ’ తోను, పద్మాన్ని ‘ ప’తోను సూచిస్తే, ఆ 24 అమరికలు  క్రింది విధంగా వుంటాయి. 1) శచగప 2) శచపగ 3) శపచగ 4) శపగచ 5)శగచప 6)శగపచ 7)చపగశ 8)చపశగ 9)చగపశ 10)చగశప 11)చశగప 12)చశపగ 13)గపశచ 14)గపచశ 15)గచశప 16)గచపశ 17)గశపచ 18)గశచప 19)పచగశ 20)పతశగ 21)పశగచ 22)పశచగ 23)పగశచ 24)పగచశ. పైవన్నీ ఒక క్రమంలో ఉన్న విషయన్ని అందరూ గమనించవచ్చు. ఈ 24 నామాలు పెద్దలందరికీ తెలిసినా‌ వీటి వెనుక ఉన్న ఈ కారణం చాలా కొద్దిమందికే తెలిసి ఉంటుంది.  కేశవ నామాలు:-     కేశవ,నారాయణ మాధవ,గోవింద విష్ణు,మధుసూధన త్రివిక్రమ,వామన శ్రీధర,హృషీకేశ పద్మనాభ,దామోదర సంకర్షణ,వాసుదేవ అనిరుధ్ధ,ప్రద్యుమ్న, పురుషోత్తమ,అధోక్షజ నారసింహ,అచ్యుత జనార్ధన,ఉపేంద్ర హరి శ్రీకృష్ణ. ఇదీ కేశవనామాల వెనకున్న శాస్త్రీయ కారణం.

Read More
 కపిలమహర్షి ప్రతిపాదించిన తత్వాలు!

కపిలమహర్షి ప్రతిపాదించిన తత్వాలు!

ఐదు మహాభూతములు (భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము), అహంకారము, బుద్ధి, మూలప్రకృతి, పది ఇంద్రియములు, మనస్సు, ఐదు తన్మాత్రలు (శబ్ద, స్పర్శ, రస, రూప, గంధము), కోరికలు, ద్వేషము, సుఖము, దుఃఖము, శరీరము, అందులో ఉన్న చేతనా శక్తి, ధైర్యము, ఇవన్నీ కలిస్తే దానిని క్షేత్రము అని అంటారు. క్షేత్రము అంటే కేవలము కనిపించే ఈ శరీరమే కాదు ఈ క్షేత్రము పంచభూతములతో ఏర్పడింది. ఈ క్షేత్రములో పంచభూతములు, పంచతన్మాత్రలు (శబ్ద,స్పర్శ,రూప,రస,గంధములు), పది ఇంద్రియములు, బుద్ధి, మనసు, అహంకారము, ప్రకృతి, ఈ ఇరవైనాలుగు తత్వములు కలిసి క్షేత్రము అని అంటారు. ఈ క్షేత్రములో ఉన్న పదార్ధములు ఒకదానితో ఒకటి కలిసినపుడు వికారములు కలుగుతాయి. అవే కోరికలు, ద్వేషములు, సుఖము, దుఃఖము, తెలివి (జ్ఞానము), మనస్సులో చేసే సంకల్పాలు, ధైర్యము అనే వికారములతో కూడినదే ఈ క్షేత్రము. క్షేత్రము అంటే మన శరీరమే కాదు బయట కనిపించే ప్రకృతి కూడా క్షేత్రమే. అందులో నుండే ఈ జీవులు అన్నీ పుడుతున్నాయి. పెరుగుతున్నాయి. ఈ శరీరాలు అన్నీ ప్రకృతిలో భాగమే. శరీరంలో ఉండే మనసు, బుద్ధి, అహంకారము వలన కలిగే వికారములు అనగా సుఖదుఃఖము, ఇవన్నీ కూడా క్షేత్రము యొక్క లక్షణాలే. క్షేత్రము అంటే కేవలము కనిపించే ఈ శరీరమే కాదు ఈ క్షేత్రము పంచభూతములతో ఏర్పడింది. ఈ క్షేత్రములో పంచభూతములు, పంచతన్మాత్రలు (శబ్ద,స్పర్శ,రూప,రస,గంధములు), పది ఇంద్రియములు, బుద్ధి, మనసు, అహంకారము, ప్రకృతి, ఈ ఇరవైనాలుగు తత్వములు కలిసి క్షేత్రము అని అంటారు. ఈ క్షేత్రములో ఉన్న పదార్ధములు ఒకదానితో ఒకటి కలిసినపుడు వికారములు కలుగుతాయి. అవే కోరికలు, ద్వేషములు, సుఖము, దుఃఖము, తెలివి (జ్ఞానము), మనస్సులో చేసే సంకల్పాలు, ధైర్యము అనే వికారములతో కూడినదే ఈ క్షేత్రము. క్షేత్రము అంటే మన శరీరమే కాదు బయట కనిపించే ప్రకృతి కూడా క్షేత్రమే. అందులో నుండే ఈ జీవులు అన్నీ పుడుతున్నాయి. పెరుగుతున్నాయి. ఈ శరీరాలు అన్నీ ప్రకృతిలో భాగమే. శరీరంలో ఉండే మనసు, బుద్ధి, అహంకారము వలన కలిగే వికారములు అనగా సుఖదుఃఖము, ఇవన్నీ కూడా క్షేత్రము యొక్క లక్షణాలే.

Read More
 వాతాపి గణపతి చరిత్ర..!

వాతాపి గణపతి చరిత్ర..!

కర్ణాటకలో బాదామి అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం ఒకప్పుడు చాళుక్యులు అనే రాజవంశపు ఏలుబడిలో ఉండేది. బాదామిని రాజధానిగా ఏర్పాటు చేసుకుని పాలించారు కాబట్టి, వీరికి బాదామి చాళుక్యులు అన్న పేరూ ఉంది. ఈ చాళుక్యులకీ, పల్లవులకీ నిరంతరం యుద్ధాలు జరుగుతూ ఉండేవి. ఒకసారి వారిది పైచేయి అయితే ఒకోసారి వీరిది పైచేయిగా ఉండేది. అలాంటి ఒక పోరులో పల్లవులది పైచేయి అయ్యింది. ఆ విజయానికి చిహ్నంగా వారు బాదామిలో ఉన్న గణపతిని తీసుకువెళ్లి తిరువారూర్‌ జిల్లాలోని ‘తిరుచెన్‌కట్టంకుడి’ అనే ప్రాంతంలో ప్రతిష్టించారు. బాదామికి పూర్వం వాతాపి అన్న పేరు ఉంది కాబట్టి ఆ గణపతిని వాతాపి గణపతి అని కొలుచుకునేవారు. ఇంకా మరిన్ని విశేష్లాల కోసం ఈ వీడియోను చూడండి… 

Read More
 నురగ వినాయకుడు..

నురగ వినాయకుడు..

వినాయక చవితికి వినాయకుడికి చక్కగా పూజ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు కదా?   మరి ఈ సందర్భంగా ఒక విశేష వినాయక ఆలయాన్ని గురించి చెప్పనా? ఈ మధ్య వినాయక చవితి ఉత్సవాల్లో స్వీట్స్ తో, కాయగూరలతో, పూలతో, చెరుకుగళ్ళతో, డబ్బులతో, …..ఇలా ఒకటేమిటి అనేక రకాల వినాయక విగ్రహాలను ఎంతో అందంగా మలచటం చూస్తున్నాం కదా… ఇంకా మరిన్ని విశేషాలు కోసం ఈ వీడియోను చూడండి…

Read More
 సముద్రుడికి, రాముడికి మధ్య సంభాషనేంటి?

సముద్రుడికి, రాముడికి మధ్య సంభాషనేంటి?

సుకుడు పక్షి వేషంలో వచ్చి ఆకాశంలో నిలబడి, సుగ్రీవుడిని ఉద్దేశించి రావణుడు చెప్పిన మాటలని చెప్పాడు. ఇదంతా విన్న సుగ్రీవుడు  “దుర్మార్గ దురాత్ముడు అయిన రావణుడు నిజంగా అంత శక్తి కలిగినవాడైతే, రామలక్ష్మణులు లేని సమయంలో సీతమ్మని ఎందుకు అవహరించాడు. రాముడి కోదండ  పాండిత్యము ముందు రావణుడు నిలబడలేడు. వాడి స్నేహము, వాడి సందేశము నాకు అక్కరలేదు” అన్నాడు. ఈలోగా అక్కడున్న వానరాలు గూఢచారిని విడిచిపెట్టకూడదని చెప్పి, అందరూ పైకి ఎగిరి ఆయన రెక్కలు విరిచేస్తున్నారు. అప్పుడా సుకుడు ‘రామ రామ’ అని ఏడిస్తే, రాముడు వెంటనే ఆ వానరాలని శాంతింపచేసి సుకుడుని విడిపించాడు. కాని వానరములు సుకుడిని బందీగా పట్టుకుని ఉంచాయి. ఏమిచేస్తే ఈ సముద్రం మనకి దారి ఇస్తుంది అని విభీషణుడిని అడుగగా, ఆయన అన్నాడు “రాముడు శరణాగతి చేస్తే సముద్రం దారి ఇస్తుంది” అన్నాడు. చందనము మొదలైన వాటి చేత ఒకనాడు అలదబడినటువంటి బాహువు, కోట్ల గోవులని దానము చేసిన బాహువు, మణులతో కూడిన కేయూరములు మొదలైనవాటితో అలంకరింపబడ్డ బాహువు, అనడమంది స్త్రీలచేత స్నుసింపబడ్డ బాహువు, ఒకనాడు సీతమ్మ తలగడగా వాడుకున్న బాహువుని ఈనాడు తనకి తలగడగా చేసుకొని రాముడు సముద్రానికి శరణాగతి చేసి సముద్రపు ఒడ్డున పడుకున్నాడు. మూడు రాత్రులు గడిచిపోయినప్పటికి సముద్రుడు రాకపోవడం వలన రాముడికి ఆగ్రహం వచ్చి లక్ష్మణుడితో అన్నాడు “పౌరుషం ఉన్నవాడు తన పౌరుషాన్ని ప్రకటించకుండా మంచితనాన్ని ప్రకటిస్తే చేతకానివాడిగా చూస్తుంది ఈ ప్రపంచం. ఈ సాగరం దారి ఇవ్వకపోతే నేను వెళ్ళలేను అనుకుంటుంది. బ్రహ్మాస్త్రం చేత ఈ సాగరాన్ని ఎండించేస్తాను. ఇందులో ఉన్న తిమింగలాలని, మొసళ్ళని, పాములని, రాక్షసులని నిగ్రహిస్తాను. ఒక్క ప్రాణి బతకకుండా చేసేస్తాను. ఈ బ్రహ్మాస్త్రం విడిచిపెట్టిన తరువాత ఇక్కడ నీరు ఉత్తర క్షణం ఆవిరయిపోయి ధూళి ఎగురుతుంది. అప్పుడు వానరులందరూ భూమి మీద నడుచుకుంటూ లంకని చేరుకుంటారు” అని చెప్పి, కోదండాన్ని తీసి బ్రహ్మాస్త్రాన్ని అనుసంధానం చేశాడు. అలా చేసేటప్పటికి పర్వతాలన్ని కదిలిపోయాయి, వ్యాకులంగా గాలి వీచింది. అగ్నిహోత్రపు మంటలు సూర్యుడి నుండి కిందపడ్డాయి, ప్రాణులన్నీ దీనంగా ఘోష పెట్టాయి, రెండు యోజనముల దూరం సముద్రము వెనక్కి వెళ్ళిపోయింది. ఆ సమయంలో సముద్రుడు లోపలినుండి బయటకి వచ్చాడు. ఆ సముద్రంలో పుట్టిన అనేకమైన బంగారములు, రత్నములతో కూడిన ఒక పెద్ద హారాన్ని సముద్రుడు వేసుకొని ఉన్నాడు. శ్రీ మహావిష్ణువు ధరించే కౌస్తుభానికి తోడపుట్టిన ఒక మణిని మెడలో వేసుకొని ఉన్నాడు. పైకి కిందకి వెళుతున్న తరంగ సద్రుస్యమైన వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. గంగ, సిందు మొదలైన నదులన్నీ స్త్రీల స్వరూపాన్ని పొంది ఆయన వెనుక వస్తున్నాయి. పైకిలేచిన సముద్రుడు రాముడికి నమస్కరించి “భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశములు అనే పంచ భూతములు ఉన్నాయి. వీటన్నిటికీ ఒక స్వభావం ఉంటుంది, ఆ స్వభావాన్ని ఈ పంచ భూతములు అతిక్రమించలేవు. సముద్రం అంటే అగాధంగా ఉండాలి. లోతుగా ఉండాలి, అందులోకి దిగినవాడికి ఆధారం చిక్కకూడదు, సముద్రంలో ఏదన్నా పడితే మునిగిపోవాలి, వ్యాకులితమైన తరంగాలతో ఒడ్డుని కొడుతూ ఉండాలి. ఇలా ఉండకపోతే దానిని సముద్రము అనరు. అందుకని ఈ సముద్రాన్ని ఎండింపచెయ్యడం, సముద్రంలో నుండి దారి ఇవ్వడం నాకు వెలువడే విషయం కాదు.. నువ్వు అభిమంత్రించిన బ్రహ్మాస్త్రాన్ని నా మీదకి వెయ్యకు.  నీ దగ్గర ఉన్న వాసరములలో విశ్వకర్మ కుమారుడైన నలుడు ఉన్నాడు. విశ్వకర్మ గొప్ప గొప్ప కట్టడములను నిర్మిస్తూ ఉంటాడు. అటువంటివాడి తేజస్సు కనుక ఈ నలుడికి సేతువు నిర్మాణం తెలుసు. మీరు నా మీద సేతువుని నిర్మించుకోండి. అందుకని వానరులు తెచ్చి పడేసిన చెట్లు, బండలు మొదలైనవి అటూ ఇటూ చిమ్మకుండా నా తరంగముల చేత తేలేటట్టు చేస్తాను. నాలో ఉన్న ఏ క్రూర మృగము వలన వారధిని దాటేటప్పుడు వానరములకి ఎటువంటి భీతి లేకుండా నేను కాపాడతాను. సేతు నిర్మాణం వెంటనే ప్రారంభించండి. ద్రుమకుల్యము అని ఉత్తర తీరంలో ఉంది. అక్కడుండే జలాలని ఆభీరులు, దాస్యులు అనే వారు తాగేస్తుంటారు. సముద్రాన్ని క్షోభింప చేస్తుంటారు. అందుకని నువ్వు ఈ బ్రహ్మాస్త్రాన్ని ఇక్కడి నుండి అక్కడికి ప్రయోగించు” అన్నాడు.

Read More
 లోకం గురించి పరశురాముని ఆలోచన ఏమిటి?

లోకం గురించి పరశురాముని ఆలోచన ఏమిటి?

ఒక రోజు పరశురాముడు దత్తాత్రేయుని సందర్శించడానికి బయలుదేరి మార్గమధ్యలో లోకవ్యవహారం గురించి ఆలోచిస్తూ ఇలా అనుకొన్నాడు… “అయ్యో! నేను ఇంతవరకు దేనిని గురించి ఆలోచించాలో ఆ ముఖ్య విషయం గురించి ఆలోచించలేదు. ప్రవాహంలో పడి కొట్టుకొనిపోతున్నవాడిలా – ఎలా వెళుతున్నానో, ఎందుకు వెళ్ళుతున్నానో తెలియకుండానే అందరితోపాటు నేను కూడా వ్యవహారం చేస్తున్నాను. గ్రుడ్డివాని వెంట వెళ్ళే గ్రుడ్డివారివలె ప్రజలందరూ ఒకరిని చూసి మరొకరుగా వ్యవహారములలో మునిగిపోతున్నారు. తాము చేస్తున్న పనికి పర్యవసానం ఎలా ఉంటుందో తెలుసుకోకుండానే ప్రజలు వ్యవహరిస్తున్నారు. ఎవనికైనా ఒకనికి ఏదో కొంచెం ఫలం దైవికంగా సంభవించడం చూసి, తమకు కూడా అటువంటి ఫలమే అంతకన్నా అధికంగా లభిస్తుందనే పేరాశతో, శక్తికి మించిన పనులను పూనుకొని ఆపదలను కూడా పొందుతున్నారు. ఇదంతా – ఎరను చూసి దానికొరకు గాలములో చిక్కుకొంటున్న చేపలాగా ఉంది. అలాగాక ఈ దిక్కుమాలిన సంసారంలో సుఖం ఏముంది? దేవతల నుండి క్రిమికీటకముల వరకు అందరూ సుఖం పొందాలనే మిక్కిలి ఆరాటంతో వ్యవహరిస్తున్నారు. నాలుక వలన కలిగే రుచి, మైధునం వలన సుఖం క్రిమికీటకములతో సమానంగానే త్రిలోకాధిపతికీ కలుగుతున్నది. భౌతికమైన ఈ దేహం కొరకే సర్వం కోరబడుతున్నది. ఇది మల మూత్ర మాంసం మొదలైనవాటితో పూర్ణమై, కుత్సితమై, దుఃఖమూలమై ఉంది. దీని మూలంగానే పుత్ర-మిత్ర-కళత్ర రూపమైన సంసారం ఏర్పడుతున్నది. ఇటువంటి దేహమునే తననుగా భావిస్తూ దీనికోసమే పామరుడు, పండితుడు కూడా నింద్యకృత్యములకు పాల్పడుతున్నారు.  దేహం రోగగ్రస్తమై ముసలితనంలో కృశించి హేయమవడం ఇతరులలో చూస్తున్న ప్రతివ్యక్తి, నా శరీరం మాత్రం అటువంటి బాధలకు లోను కాదు అన్నట్లు వ్యవహరిస్తున్నాడు. ఈ కుత్సితమైన శరీరమునందే స్త్రీలు, పురుషులు సౌందర్యమును భావిస్తూ భోగలంపటులు అవుతున్నారు. నాలుకయొక్క రుచికి, మైధున సుఖమునకు లోబడి మానవులు ఎల్లపుడూ అతి సమీపంలోనే ఉండే మృత్యువును గమనించడం లేదు. తమ జీవితం ఎంత అల్పమైందో గుర్తించని ఈ మానవులు దీర్ఘ కాలంలో, ఎప్పటికో లభించు ఫలములను కోరి నిరంతరం పాటుపడుతున్నారు. స్వార్థం కోసం వీరు ఇతరులను చంపడానికి కూడా వెనుకాడరు. ఇలా కామక్రోధ పరాయణులై వీరు పొందే సుఖం ఏమిటి? అల్పసుఖంకోసం వీరు అధిక దుఃఖమునే పొందుతున్నారు. వీరి ఆశలకు అంతం ఎక్కడ? ఆశ ఉన్నంతవరకు సుఖం ఎక్కడ? మనస్సు కామానికి లొంగడమే  మహాదుఃఖము. సర్వసంపదలతో సామ్రాజ్యం లభించినవానికైనా సుఖం ఎక్కడిది? వాటిని ఇంకా అభివృద్ధి చేయాలనే ఆశ వలన, శత్రువులు వచ్చి చంపుతారేమో అనే భయం వలన రాజులకు, ధనవంతులకు కూడా ఎల్లపుడూ దుఃఖమే కలుగుతోంది.  ఎంతో కష్టపడి మనుష్యులు సంపదలను పొందుతున్నారు. వాటికొరకే మిత్రులు శత్రువులు అవుతున్నారు. పుత్రులు తండ్రులపై తిరగబడుతున్నారు. ప్రియురాలు ప్రియునికి ద్రోహం చేస్తున్నది. భార్యాపుత్రులు కూడా ధనవంతునకు మృత్యువును కోరుతున్నారు. అలా మృత్యువుతో సమానమైన ధనమును కోరుతూ మానవులు కుటుంబమును తమచుట్టూ గూడువలె అల్లుకొని, అందులో చిక్కుపడి బయటకు రాలేక తన్నుకొంటున్నారు.  ఎవడు ఏ కుటుంబంతో ఎటువంటి సంబంధమును, ఎంతకాలం కలిగి ఉన్నా ఒకప్పటికి వియోగం పొందక తప్పదు. కానీ, భార్యా పుత్రులతో సంబంధం అత్యంత స్థిరమైనట్లుగా స్నేహమును పెంపొందించుకొని, మనుష్యులు చివరకు మహాదుఃఖమును పొందుతున్నారు. ధనములు, జనములు మొదలుగా సర్వము అత్యంత బలిష్ఠమైన మృత్యువుచేత ఆక్రమింపబడి ఉంది. కావున మనశ్శాంతిని కోరే బుద్ధిమంతుడు ఎవడూ వాటిమీద ఆసక్తి చెందకూడదు. ఏది ప్రాప్తిస్తే భయమే ఉండదో, అటువంటి పదమునే బుద్ధిమంతుడు కోరుకోవాలి.  కాబట్టి అభయమును కలిగించే విజ్ఞానం కోసం నేను మహనీయుడైన దత్తాత్రేయుని ఆశ్రయిస్తాను అనుకున్నాడు పరశురాముడు.

Read More